ఉమ్మడి నల్గొండ జనసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఉమ్మడి నల్గొండ, భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు లొట్లపల్లి పూర్ణ చందర్ రావు దామరచర్ల మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత జాతికి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు సంజయ్ గౌడ్, మౌలానా, గోపి నాయుడు పాల్గొన్నారు.