క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన గాదె
పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం, మంచాల గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పప్పు భరత్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఇతను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున గురువారం పార్టీ నుంచి 50,000 రూపాయల చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేయుడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా నాయకులు తాళ్లూరి అప్పారావు, మేకల రామయ్య యాదవ్, దేశంశెట్టి సూర్య, మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, నాగిశెట్టి సుబ్బారావు, వీరెల్ల వెంకటేశ్వరరావు, నగర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-18-at-6.04.47-PM-1024x576.jpeg)