IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్..
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులును అనుమతించనున్నారు. యూఏఈలో కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 16 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి.