చెత్త పన్ను కట్టక పొతే క్రిమినల్ కేసులా..? రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని శనివారం 32 డివిజన్ శానిటైజర్ సెక్రటరీ ప్రత్యుష చెత్త పన్ను కట్టలేదని స్థానిక 32 డివిజన్ కు చెందిన లక్ష్మి అనే మహిళ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన పై పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు స్పందిస్తూ.. ప్రభుత్వ పన్ను కట్టక పొతే నోటీసులు ఇవ్వాలి, లేకుంటే వడ్డీ విధించాలి.. ఈ విధంగా క్రిమినల్ కేసులు పెట్టే తీరు వైసీపీ పాలనలోనే చూస్తున్నాం అని ఈ ఘటనను రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు.