మంత్రి వేణుపై జనసేన నేత బాలకృష్ణ ఫైర్..

రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ టిడిపి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముందు మోకరిల్లడం శెట్టిబలిజీలు సిగ్గు పడేలా ఉందని జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి పితాని బాలకృష్ణ విమర్శించారు.

ఓ దొంగల ముటా నాయకుడు ముందు మోకరిల్లి శెట్టిబలిజ జాతి తలవంచుకునేలా చేశారు..

బి.సి.లకు గాని శెట్టిబలిజీలకు గానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లబ్ధీ చేకూరలేదు.. బి.సి.కార్పోరేషన్లు నిర్వీర్యం చేసి.. గతంలో వలే పలువురు స్వయం సమృద్ది సాదించేందుకు అందేసాయం అందకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే..

బి.సి.లకు ఎంచేశారని మంత్రి వేణు దొంగల ముటా నాయకుడు ముందర మోకరిల్లారో వెల్లడించాలి..

ఒక్క వేణుకు మంత్రి పదవి రావడం వలన శెట్టిబలిజీలు కు ఏం ఉపయోగం జరగలేదు.. తక్షణం వేణు శెట్టిబలిజీ జాతికి క్షమాపణ చెప్పాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.. ఈ సమావేశంలో పలువురు జనసేన పార్టీ శెట్టిబలిజీసంఘం నాయకులు పాల్గొన్నారు.