జగన్ రెడ్డి మూర్ఖత్వం పరాకాష్టకు చేరింది

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: తన అరాచక పాలనతో ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఓటమి కళ్ళముందే కనబడడంతో రాష్ట్ర సీఎం జగన్ రెడ్డి మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. ఆదివారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై 26 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సేవాభావంతో అతి తక్కువ వేతనంతో సేవలందించే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం శోచనీయమని మండి పడ్డారు. అంగన్వాడీల ఆత్మగౌరవానికి జగన్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో చివరికి అంగన్వాడీలే విజయం సాధిస్తారన్నారు.