దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

ఆత్మకూరు: సంగం మండలం కోలగట్ల గ్రామం ఎస్సీ కాలనీ నందు వర్షాలు కారణంగా ఎస్సీ కాలనీ ప్రజలు నడిచే రహదారి వర్షం నీరుతో మరియు గుంతలు, బురద మయంతో ఏర్పడడం జరిగింది. కోలగట్ల రహదారి డ్రైనేజీ కాలువలు లేక డ్రైనేజీ నీళ్లు మరియు వర్షం నీరు రోడ్లమీద నిలవ ఉండడం వల్ల దోమల వలన విష జ్వరాలు గ్రామ ప్రజలకు సోకుతున్నాయి. ఇప్పటికైనా కోలగట్ల గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించి. ఎస్సీ కాలనీ లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని ఎంపీడీవో గారికి పై సమస్యల మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోలగట్ల ఎస్సీ కాలనీ గ్రామస్తులతో కలిసి సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగినది. లేనిపక్షంలో ఈ సమస్యలు తీర్చే దిశగా జనసేన పార్టీ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘ మండల నాయకులు హజరత్, పనింద్ర, నవీన్, చిన్నయ్య, వెంకట రమణయ్య, వెంకటరమణయ్య, చిన్న పెంచలయ్య, రాజా తదితరులు పాల్గొన్నారు.