జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన నాయకులు
ఎమ్మిగనూరు: జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన నాయకులు అండగా నిలచారు. ఎమ్మిగనూరులో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సిల్వరి వెంకటేష్ భార్య సౌజన్యకు జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, కాసా రవి ప్రకాష్, కర్ణం రవిలు కలసి 10000 పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తమ కుటుంబ మనిషిగా భావిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమకు తోచిన విదంగా సహాయం చేయడంలో ముందుంటామని అన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎటువంటి ఇబ్బందులకు గురైనా తమకు తోచిన విధంగా సహాయం చేస్తామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-4.24.58-PM-1024x769.jpeg)