జగనన్న కాలనీల భాదితుల తరుపున జనసేన గళం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొదటి రోజులో భాగంగా వజ్రకరూర్ మండలం కేంద్రం మరియ మండలంలోని పందికుంట, రాగులపాడు గ్రామలలో పర్యాటించటం జరిగింది. జగనన్న కాలనీ జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందులో మొదటి రోజులో భాగంగా మండల పరిధిలో గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా గ్రామములో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రతి అంశాన్ని మరియు జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్యపై జనసేన ప్రజల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చనాల డిమాండ్ చేశారు. పందికుంట, రాగులపాడు గ్రామాల్లో జగన్‌కాలనీలో లేవని మీరు ఎక్కడ అని వెతుకుతారు అని అక్కడ గ్రామస్థులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో మండల ఉపాధ్యక్షులు హరిశంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి అంజినేయులు, కార్యదర్శి జీలాన్, సంయుక్త కార్యదర్శులు జగదీష్, భార్గవ్, వెంకట్రమణ మండల నాయకులు లాలూ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.