జనసేన బలోపేతమే లక్ష్యంగా జనంకోసం జనసేన కార్యక్రమం

ప్రజా సమస్యలను పరిషత్ లో వినిపించడానికి మండలంలో మరొక్కసారీ సగౌరవంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు అడగటానికి జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు తుమ్మలపాలెం ఎంపిటిసి సభ్యుడు పోలిశెట్టి తేజ నిర్వహించిన జనంకోసం జనసేన కార్యక్రమం గురువారం తాను ఎంపీటీసీ గా గెలుపొందిన తన స్వగ్రామం తుమ్మలపాలెం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తూ వారి ప్రాథమిక సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకి మరియు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి జరిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రజా సమస్యలను మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ప్రస్తావించి వాటి పరిష్కారం అయ్యేలా నా వంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.