పాత్రికేయులపై దాడికి ప్రయత్నించడం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను బయటపెడుతున్న జనసైనికుల మీద తన అనుచరులతో దాడి చేయించిన జోగి రమేష్ చివరికి ఆ కార్యక్రమాలను కవర్ చేసి, ప్రతిపక్షాల గళాన్ని వినిపిస్తున్న పాత్రికేయ మిత్రులపై కూడా తన అనుచరులతో జోగి రమేష్ దాడికి ప్రయత్నించడం అంటే అతనికి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు అని అర్థమవుతుంది. ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు పాత్రికేయ మిత్రులపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించాలి. దాడికి ప్రయత్నించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని ఎస్ వి బాబు డిమాండ్ చేసారు.