దివిస్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన తొండంగి జనసేన నాయకులు

తుని నియోజకవర్గం, తొండంగి మండలం, కొత్త పాకాల పంపదిపేట పంచాయతీల పరిధిలో గతంలో నిలిపివేసిన దివిస్ ప్యాక్టరీ పనులు మరలా తిరిగి చేపట్టగా స్థానిక మత్స్యకారులు, రైతులు పనులను అడ్డుకొని వారు స్థానిక జనసేన నాయకులు తొండంగి మండల అధ్యక్షులు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శనివారం ఆయన బాధిత ప్రాంతాల్లో తుని ఐ.టీ కోఆర్డినేటర్ మణిబాబు బుసాలా, మండల ఉపాధ్యకులు కాండవలి గణేష్, మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్, బెండపూడి జనసేన గ్రామ అధ్యక్షులు కోరుకొండ శివ పర్యటించి గ్రామస్తులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయం పార్టీ జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం దృష్టికి పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాము అని హామీ ఇచ్చారు.