రాబోయే ఎన్నికల బరిలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో జనసేన పోటీ: బైరపోగు సాంబశివుడు

వీపనగండ్ల మండల కేంద్రంలో జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గం కో-ఆర్డినేటర్ భైరవ సాంబశివుడు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయి నుండి మండల వ్యాప్తంగా తీసుకు వెళ్ళే కార్యాచరణ గురించి, పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలతోటి సమావేశంలో చర్చించారు. పార్టీ గెలుపు దిసగా జనసేన పార్టీ సిద్ధాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాలని నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు చేరువయ్యే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రజలకు తెలిసే విధంగా గడపగడపకి పార్టీని విస్తరించాలని, విస్తరించే దిసగా కార్యచరణ ఉండాలని ఆయన గుర్తు చేశారు. అలాగే వీపనగండ్ల మండల వ్యాప్తంగా ప్రజా సమస్యల పైన దృష్టి సారించి అవి పరిష్కరించే దిశగా మన భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని దానికి తగిన సూచనలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, జనసేన పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసే బాధ్యత, పార్టీని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన నాయకులు మీసాల విశాల్ కిరణ్, బాలకృష్ణ, శ్రీకాంత్, శివకృష్ణ, ఎజ్జు ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.