జనసేన పార్టీకి అత్యధిక మెజారిటీ సాధనే లక్ష్యం: బుద్ధ ప్రసాద్

అవనిగడ్డ: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అత్యధిక మెజారిటీ సాధనే లక్ష్యంగా సమిష్టి కృషి చేద్దామని జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. బుధవారం అవనిగడ్డలో బుద్ధప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ఆధ్వర్యంలో నాగాయలంక మండల జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో నాగాయలంక మండల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. బండ్రెడ్డి మల్లి, బండ్రెడ్డి హరి, బొడ్డు విజయ్, కొక్కిలిగడ్డ లంకేశ్వరరావు, మత్తి రాజా, లేబాక అంకాలు, రేమాల మురళీ, బీ.పాపారావు, ఎం.సురేష్, రామకృష్ణలతో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను అఖండ మెజారిటీతో విజయం సాధించేలా కలిసి పని చేద్దామని నూతన కమిటీ సభ్యులకు బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు.