యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమం

రాజంపేట నియోజకవర్గం: ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలంలో మొదటి విడత జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈదరపల్లి, విజయసాగర్ గ్రామాలలో పర్యటించి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ మేనిఫెస్టోని పూర్తిగా వివరించిన జనసేన నాయకులు, జనసైనికులు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చిన జనసేన నాయకులు, జనసైనికులు. నందలూరు జనసేన నాయకులు ప్రశాంత్ భారతాల గారు మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉండి రాష్ట్ర స్థాయి క్యాడర్ లో ఉన్నతమైన డీఆర్డీఏ పదవిలో పని చేసిన యల్లటూరు శ్రీనివాస రాజు మనందరి మద్దతు తో ఎన్నో ప్రజా సమస్యలకి, ఉపాధికి పరిష్కారం చూపుతారని ప్రజలకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల చలపతి, భారతాల ప్రశాంత్, సాయి శ్రీనివాస్, తిప్పాయపల్లి ప్రశాంత్, అబ్బిగారి గోపాల్, మంటి సుబ్బు, వెలకచెర్ల హరి బాబు, పోకూరి మల్లికార్జున, పైడికొండ్ల సునీల్ , మహేష్, కివిటీ, సాయి, భత్యాల వినయ్, నందు, కరీముల్లా, భారతాల బాలాజీ, పోకూరి మనోహర్, అల్లిశెట్టి కిరీటి, నరేంద్ర, హరి, అమర్, చందు, మధు, కళ్యాణ్, సాయి, మొహమ్మద్, వాహబ్, కరీముల్లా, వర్ల కార్తీక్, శ్రీకాంత్, మహి, హరికృష్ణ మొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.