రేషన్ కార్డు లేని కుటుంబాలకు జనసేన సాయం

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో ఆధాల నగర్ కి ఆనుకొని గుడిసెలలో నివసిస్తున్న గిరిజనులకు రేషన్ కార్డు లేక రేషన్ బియ్యం రాని పరిస్థితి. అయితే ఆ విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం నుంచి వారికి రేషన్ కార్డు మంజూరయ్యేవరకూ ప్రతి నెల ప్రతి కుటుంబానికి పది కేజీల చొప్పున బియ్యం ఇవ్వడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రెండవ నెల సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆ గిరిజనులకి బియ్యంతో పాటు.. పిల్లలకి బిస్కెట్లు, బట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులని ప్రభుత్వం ఆదుకోవాలి వారికి ఉండటానికి గూడు, తినటానికి కూడు వారికి అందుబాటులో ఉండేవిధంగా కేటాయించాలని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, గడ్డం సునీత, రహీం, నాగరాజు, వీరబాబు, రవి, సందీప్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.