శైలేష్ కుటుంబానికి జనసేన భరోసా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలో భాగంగా నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ నగర్లోని షైక్ శైలేష్ అనే బాలుడు ప్రమాదవశాత్తు తలకి దెబ్బ తగిలి మానిసికస్థితిని కోల్పోతే వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము రావటంలేదని పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని, రోజూ ఆటో తోలితే కానీ జీవనం సాగించలేని పరిస్థితిలో పిల్లవాడి తండ్రి తిరుపతిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కి అర్జీ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అర్జికి స్పందించి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ కి నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుకి తెలియచేసారు. వెంటనే నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వారి ఇంటికి వెళ్ళి పిల్లవాడి పరిస్థితిని చూసి డాక్టర్ తో మాట్లాడి వారి వైద్యానికి ఆయ్యే ఖర్చుని మరియు పిల్లవాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వివరాలను వెంటనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియచేస్తాం అని, వీరికి జనసేన పార్టీ తరుపున సహాయక చెర్యలు అందేలా చేస్తాం అని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర కార్యదర్శి అక్కిశెట్టి శ్రీధర్, నగార డివిజన్ ఇన్చార్జులు సుల్తాన్ బాషా, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.