Kakinada: విద్యార్థులపై లాఠీఛార్జిని ఖండించిన జనసేన

కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఐడియల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని జనసేన పార్టీ ఖండించింది.

గాయపడిన విద్యార్థులను పరామర్శించి మద్దతు తెలిపి కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన పార్టీ పిఎసి సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్ చర్చించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు.