గడికోట పంచాయితీ బ్రిడ్జికోసం జనసేన ధర్నా

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లిమండలం, గడికోట పంచాయితీకి చెందిన బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్ల దాదాపు 12 గ్రామాలు 2000 కుటుంబాల ప్రజలు బ్రిడ్జి నిర్మాణం లేక అష్ట కష్టాలు పడుతున్నారు.ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గడికోట ప్రజల తరపున పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన మొట్ట మొదటి ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే ఏకైక పార్టీ. గడికోట బ్రిడ్జి నిర్మాణం కడప జిల్లా కలెక్టరేట్ వద్ద జనసేన ధర్నా కార్యక్రమం హరిరాయల్ ఆధ్వర్యంలో చేపట్టింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా రామ శ్రీనివాసులు మరియు రాజంపేట నియోజకవర్గ మరియు జిల్లాలో ఇతర మండలాల నాయకులు, జనసైనికులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.