ఈదరపల్లిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన జనసేన నాయకులు
అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి గ్రామంలో ఐదవ వార్డ్ లో గత కొన్ని నెలలగా డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస దృష్టికి రావడంతో గ్రామ ప్రెసిడెంట్ దృష్టి కి తీసుకొని వెళ్లడంతో జనసేన పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ ఉప సర్పంచ్ ప్రజలకి డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ తరఫున ఆ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.. ఎక్కడ సమస్య ఉందో అక్కడ జనసేన ఉంటుంది.. దానికి నిదర్శనం ఈదరపల్లి గ్రామ ఐదో వార్డు ప్రజలే.