విద్యుత్ ప్రమాదానికి గురైన యువకుడి కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

ఆముదాలవలస నియోజకవర్గం, ఉప్పినవలస గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే విద్యుత్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే పరామర్శించి.. కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ఆర్దిక సాయం చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి జనసేన అధినేత పవన కళ్యాణ్ స్పూర్తితో యువకులు అందరూ ముందుకి వచ్చి ఆ కుటుంబానికి మన జనసేన పార్టీ తరుపున ఒక 10వేల రూపాయలను అందించి మరియు భవిష్యత్తు లో పార్టీ తరుపున పిల్లలకు అండగా ఉంటామని మాట ఇవ్వడం-జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోరుకొండ. మల్లేశ్వరావు, కిల్లాన. నరేష్, తులగాపు మౌళి, దూబ సంగం, కొత్తకోట శ్రీను, విక్రమ్ జనసేన ఎంపీటీసీ, వినోద్, మురళి మరియు జనసేన కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గున్నారు..