ప్రమాదభీమా ద్వారా జనసేన 50 వేల రూపాయల చెక్ అందజేత

జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండల క్రియాశీల సభ్యుడు వై. నితీష్ కుమార్ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడినందున ప్రమాద భీమా ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ పంపిన 50,000 రూపాయల చెక్ ను నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా కోబాక లోని నితీష్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వినుత కోటా మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ని ప్రాణంగా ప్రేమించే జనసైనికుల యోగ క్షేమాలు భుజాన వేసుకుని వారి కోసం 500 రూపాయలతో భీమా పథకం పొందడం ద్వారా 5,00,000 ప్రమాద భీమా మరియు ఆక్సిడెంటల్ పాలసీ ద్వారా 50,000 అందించడం భారత దేశంలోనే మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఈ సందర్భంగా మలి దశ క్రియాశీల సభ్యత్వం నమోదు ఈ నెల 21 నుండి ప్రారంభం కానుండగా నియోజకవర్గంలోని జనసైనికులు అందరూ సభ్యత్వం తప్పక తీసుకుని, మీకు అండగా జనసేనాని ఉన్నారని కుటుంబ సభ్యులకు భరోశా ఇవ్వాలని తెలియజేస్తున్నామని అన్నారు.