గాయపడిన జనసైనికుడికి అండగా జనసేన

మహబూబ్ నగర్ జిల్లా, రామన్నపల్లి తాండాకు చెందిన జనసైనికుడు మూడవత్ గోవింద్ మంగళవారం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురై గాయపడటంతో.. సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ సూచన మేరకు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ పి. ఆర్. రాఘవేంద్ర.. జనసైనికుడు గోవింద్ ని హాస్పటల్ కు తరలించి వారికి తోడుగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది.