గణేష్ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లావేరు గ్రామంలో జనసైనికులు సవలపరపు గణేష్ తండ్రి, నవీరి రమేష్ మావయ్య సవలపరపు రాముడు కొన్ని రోజుల క్రితం స్వర్గస్తులైనారు. సోమవారం లావేరు పంచాయతీ జనసేన నాయకులు వారి కుటుంబసభ్యులను పరామర్శించి, వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాధించాలని కోరుతూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ కొంత వస్తువుల రూపేణా సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గురిజా శ్రీను, రాజా రమేష్, కొమ్మూరు శ్రీనివాసరావు, రేగాన మూర్తి, చిన్ని, రేగాన ప్రేమ్ కుమార్ (పండు), నిడిగంట్ల జయంత్, సవలపరపు వేణు, ప్రకాష్ తద్తరులు పాల్గొన్నారు.