గంటా వంశీకి జనసేన నాయకుల ఘ‌న నివాళులు

పాయకరావు పేట: కోటఉరట్ల మండలం, కొడవటిపూడి గ్రామనికి చెందిన జనసైనికుడు గంటా బాబ్జి కుమారుడు గంటా వంశీ తణుకు శశి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే పీ స్ పీ కే మై గాడ్ గోడ మీద రాయడంతో శశి కాలేజీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీవ్రంగా మందులించడంతో తల్లిదండ్రులను రప్పించి క్షమాపణ పత్రం రాయించారు. వంశి తీవ్ర మనస్థాపం చెంది 11.09.2023 తేదీన మరణించడం జరిగింది. గురువారం పెదకార్యం నిమిత్తం రాష్ట్ర సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు బోడపాటి శివదత్ మరియు పాయకరావుపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి గంటా వంశీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరియు ఈ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచి వాళ్ళ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకుని వెళ్లి వంశి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.