రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె మానుకోవాలని, తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనసేన వీరమహిళలు వనజ, కీర్తన, లావణ్యలు గురువారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాలలో రోజాపై ఫిర్యాదులు చేయడం జరిగింది.