నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

తెనాలి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తెనాలి పార్టీ కార్యాలయంలో కలిసిన జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్ పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులు వివరించిన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష. ఈ సందర్భంలో మనోహర్ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని వారి గెలుపులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య రెడ్డి, ఎండి ఆయాజ్, బొంగు వాసు, పి జగన్, దాసి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.