పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న జనసేన నాయకులు

గోపాలాపురం: నల్లజర్ల మండలం, తెలికచర్ల గ్రామంలో జనసైనికుడైన కంటిపూడి సువర్ణరాజు కుమారుని పుట్టినరోజు వేడుకలో మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బొలిశెట్టి శ్రీను, జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, టీడీపీ ఇంచార్జి మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అత్యుత సత్యన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యండ్రపాటి రాజు, నల్లజర్ల మండల అధ్యక్షలు బాపిరాజు, సీనియర్ నాయకులు రుద్ర శ్రీను, వీరమహిళ సౌజన్య మరియు వివిధ గ్రామాల జనసేన పార్టీ అధ్యక్షులు, కృష్ణ, వరుణ్, శివ కృష్ణ, వివేక నంద, మురళీకృష్ణ, కిషోర్ మొదలగు పాల్గొన్నారు. మరియు నల్లజర్ల మడలం జనసేన పార్టీ అధ్యక్షులు బాపిరాజు మండలంలోని 70% గ్రామ కమిటీల లిస్టులు నియోజకవర్గం ఇంచార్జి సువర్ణరాజుకు నాయకుల అందరి సమక్షంలో అందజేసారు.