విద్యార్థి జీవితంలో వెలుగులు నింపిన నంద్యాల జనసేన నాయకులు

పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి జీవితంలో నంద్యాల జనసేన నాయకులు వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో స్థానిక సరస్వతి నగర్ లో పాలిటెక్నిక్ “ఈ ఈ ఈ” చదువుతున్న సుమంత్ గౌడ్”అనే విద్యార్థికి ఉన్నత చదువుల కోసం జనసేన నాయకులు సుందర్, చందు, సంప్రదించగా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విద్యార్థికి “లాప్టాప్” అవసరం తెలుసుకొని సుమారు 30,000 రూపాయల విలువగల లాప్టాప్ ను అందించడం జరిగింది. రాచమడుగు సుందర్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా యువత ముందుకు రావాలి చదువుకుంటున్న విద్యార్థులు చైతన్యవంతం కావాలనేదే ఆయన ఆకాంక్ష. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే పేద విద్యార్థులకు సహాయం చేయడంలో జనసేన ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులు జీవితంలో వెలుగులో నింపడమే నా ధ్యేయం అని పేర్కొన్నారు. జనసేన సుందర్, ఏ సమస్య అయినా ఆలోచించుఏమో కానీ ఒక విద్యార్థి ఇబ్బంది పడుతున్నాడు అంటే జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని జనసేన నాయకులు సుందర్, చందు తెలియజేసారు. పాలిటెక్నిక్ విద్యార్ధి సుమంత్ మాట్లాడుతూ.. నాకు సహాయం అందించిన జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ అన్నలకు ధన్యవాదాలు వారు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటానని. అలాగే ఎంతమంది పేద విద్యార్థులకు తనలాగే సహాయ సహకారాలు అందించాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి జనసేన పార్టీని సిద్ధాంతాలను నేను కూడా తూచా తప్పకుండా పాటిస్తానని నా మొదటి ఓటు జనసేనకేనని తెలిపిన పాలిటెక్నిక్ విద్యార్థి సుమంత్, ఈ కార్యక్రమంలో సాయి, అభి, చిన్న, రవి, సుబ్బు, ఈశ్వర్, బాబా, సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.