నంద్యాలలో జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన నాయకులు

నంద్యాల నియోజకవర్గం: నంద్యాలలో జగనన్న కాలనీలను శనివారం జనసేన నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని నంద్యాల జనసేన నాయకులు పిడతల సుధాకర్ ఆదేశాల మేరకు చేస్తున్నామని, గతంలో కట్టిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులేసుకుని కనీసం రోడ్డు సౌకర్యం లేకుండా వైసిపి నాయకులు జగనన్న కాలనీలో కట్టిస్తున్నామని పబ్లిసిటీగా చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరగడం లేదని జనసేన నాయకులు ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారే తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ప్రజల కష్టాల గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, సురేష్, చాచా, అశోక్, చంటి తదితరులు పాల్గొన్నారు.