కానవరం గ్రామంలో 154వ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం మండలం, కానవరం గ్రామంలో గురువారం 154వ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి కానవరం గ్రామంలో అడుగడుగునా హారతులు పడుతూ కానవరం ప్రజలు ఘనస్వాగతం పలకడం జరిగింది. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కానవరం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ అని, ప్రతీ ఒక్కరు జనసేన పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రతీ ఒక్కరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.