ప్రమాదానికి గురైన జనసైనికుడికి అండగా శివదత్ బోడపాటి
ఎస్ రాయవరం మండలం, గుర్రాజు పేట పంచాయతీలో ఉన్న జనసైనికుడు అండిబోయిన నూకరాజు ఇటీవల ప్రమాదానికి గురై సుమారు సంవత్సరం పాటు పూర్తిగా మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకున్న దొండవాక నాయకులు పిక్కి గోవిందు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి కు తెలియపరచిన వెంటనే శివదత్ స్పందించి నక్కపల్లి, ఏస్ రాయవరం మండలాల జనసేన కార్యకర్తలు మరియు గుర్రాజు పేట జనసైనికుల సమక్షంలో ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె, పప్పులు, పంచదార మరియు పలు నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురందాసు అప్పలరాజు, పిక్కి స్వామి, కోదండరాం, పప్పల శివ, గణేష్, జ్యోతి కుమార్, వరహాల బాబు, అల్లాడ రమణ, రాజు, తోట అప్పారావు, నాగేశ్వరరావు, శివాజి, జగదీష్, రాజు సూర్య తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-13-at-6.14.19-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-13-at-6.14.21-PM-1024x768.jpeg)