బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా నివాళులర్పించిన జనసేన
గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ జంక్షన్, ఎస్.సి కాంప్లెక్స్ వద్ద భారత మాజీ ఉప ప్రధాని, భారతదేశ గొప్ప దళిత నాయకుడు, పేదల ఆరాధ్య జ్యోతి డా.బాబుజగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించిన జనసేన పార్టీ. బాబు జాగ్జీవన్ రామ్ ఒకవైపు సొతంత్ర పోరాట యోధుడుగా పోరడుతూ మరోవైపు తన దళిత జాతి స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావుడు, యాభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి తెలియని రాజకీయ చక్రవర్తి, ఎన్నో మంత్రి పదవులు అలకరించారు, భారత జాతి గర్వించదగ్గ గొప్ప నాయుకుడని జనసేన నాయుకులు కొనియాడారు. గాజువాక జనసేన పార్టీ నాయుకులు మొమ్మిన మురళీ, గుంటూరు మూర్తి, రౌతు గోవింద్, ములకలపల్లి వంశీ, నరసింహ రెడ్డి, రవీంద్రబాబు, వీరమహిళలు పత్తి రామలక్ష్మి, అనురాధ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-05-at-12.05.43-PM-1024x505.jpeg)