స్మశాన వాటిక ఆక్రమణపై ఎమ్మార్వోకి వినతిపత్రమిచ్చిన జనసేన
రాజాం, రాజాం మండలం కంచరాం గ్రామంలో స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని జనసేన నాయకులు శుక్రవారం ఎమ్మార్వో విజయ్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని జనసేన నాయకులు కోరారు. దీనిపై ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సైడాల జగదీశ్వరరావు (జన) రమేష్, కళా వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-21-at-17.04.48-1024x768.jpeg)