సర్వేపల్లిలో జనసేన ప్రజాబాట

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తకోడూరు బీచ్ నందు ఎంతోమంది మత్యకారులు చిన్నచిన్న షాపులు పెట్టుకొని బీచ్ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వారికి కరెంటు లేకపోవడం ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. కొత్తకోడూరు బీచ్ పర్యాటక శాఖలో ఒక భాగం అయితే ఇప్పటివరకు ఈ బీచ్ ని అభివృద్ధి చేయాలని గాని, అదేవిధంగా బీచ్ కి సంబంధించి కొన్ని వసతులు కల్పించాలని ఆలోచన గాని లేకపోవడం చాలా సిగ్గుతో కూడినటువంటి విషయం. ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా జంబలకడి జారి మిఠాయి పర్యాటక శాఖని గాలికి వదిలేసి ఎంతసేపు మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుతుండడం సిగ్గుచేటు. దయచేసి కొత్తకోడూరు బీచ్ ని పర్యాటక శాఖలో ఒక భాగం కాబట్టే బీచ్ ని అభివృద్ధి చేయండి. బీచ్ లో వ్యాపారాలు చేసుకునే వారికి కనీస వసతులు కల్పించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రేమ్, విజయ్, నిఖిల్, రాజేష్, రహీం, అక్బర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.