త్రాగు నీటి సమస్యపై స్పందించిన జనసేన

మంగళగిరి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప ప్రజలు గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతోనే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తోందని నివాసితులు వాపోతున్నారు. టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప గృహాలకు తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గత రెండు రోజులుగా మంచినీటి ట్యాంకర్లను పంపించి తాగునీటిని సరఫరా చేయిస్తున్నారు. ఈ సందర్భంగా టిడ్కో మరియు రాజీవ్ గృహకల్ప ప్రజలు మాట్లాడుతూ మంగళగిరి కార్పొరేషన్ అధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యేకి మా సమస్యను దాదాపుగా నాలుగు సంవత్సరం నుంచి ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటికీ పరిష్కారం చేయలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. అలాగే వాటర్ ట్యాంకర్‌లను పంపి తాగునీటిని సరఫరా చేయిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావుకి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప నివాసితులు ధన్యవాదములు తెలియజేశారు.