ముస్లిం సోదర, సోదరీమణులందరికీ జనసేన అండగా ఉంటుంది
- జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ముస్లిం సోదర సోదరీమణులతో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు సమావేశమై వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు సీటు జనసేన పార్టీకి కేటాయించారు. మీరు అందరు ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుతున్నాను. వచ్చే జనసేన టిడిపి ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది. మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-26-at-7.14.52-PM-1024x576.jpeg)