నడిపల్లి రాము కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది: కందుల దుర్గేష్

తుని నియోజకవర్గం, శృంగవృక్షం గ్రామంలో నూకాలమ్మ జాతరలో మృతి చెందిన నడిపల్లి రాము కుటుంబాన్ని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి జాతరలో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని తమ కుటుంబానికి జనసేన పార్టీ అండదండగా ఉంటుందని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, తొండంగి మండల ఉపాధ్యక్షులు కండవిల్లి గణేష్, తొండంగి మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్ తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు నియోజకవర్గ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, తేనే నాగ శేషు ,రాజశేషు అంకారెడ్డి, ఇండుగుబిల్లి శ్రీను, ప్రవీణ్, గెడ్డమూరి సురేష్, జనసేన శివశంకర్, నల్లమట్టి రాము, కన్నా జనసేన, నాగూర్, ఇళ్ళ శివన్నారాయణ, ఆనంద్, మొగ్గ తేజ తదితర జనసైనికులు పాల్గొని సంతాపం ప్రకటించారు.