నరసాపురం పట్టణంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

  • జనంలోకి జనసేన 18వ రోజు

నరసాపురం: జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 18వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం పట్టణం 1వ వార్డులో ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ ప్రజలు తెలిపారని నాయకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు చెనమళ్ల చంద్రశేఖర్, రాజోలు నియోజకవర్గ నాయకులు బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నరసాపురం పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మాదంశెట్టి కోటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, వలవల నాని, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, కొప్పాడి కృష్ణవేణి, తోట అరుణ, బొమ్మిడి సూర్య కుమారి, అంబటి అరుణ, గణేశ్న శ్రీరామ్, కూనపరెడ్డి రామకృష్ణ, పిల్లా శ్రీహరి, పోలిశెట్టి సాంబ కెళ్ళా సత్తిబాబు, మీసాల సింహాద్రి, సంపత్ కుమార్, కారత్ త్రిమూర్తులు, ఏసు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.