పెత్తందారి ప్రభుత్వంపై నిరసనకి జనసేన మద్దతు

మదనపల్లె: సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాస్ వ్యవస్థాపకులు పీటీఎమ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సత్యాగ్రహం పేదల భవిష్యత్తుకి పెత్తందారి ప్రభుత్వంపై నిరసనకి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి మద్దతు తెలియజేసారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సమాజం పట్ల, ప్రజల పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తి పిటిఏం శివ ప్రసాద్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాల వారికీ అన్యాయం చేసిందని ముఖ్యంగా దళితులకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులకి, మహిళలకి, రైతంగానికి మోసం చేసిందని, కనీసం చివరి బడ్జెట్ లో అయిన మద్యపానం నిషేధం, నిరుద్యోగులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపు వారికీ న్యాయం చేయాలని అన్నారు. ఈ విధంగా అన్ని నియోజకవర్గలలో అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, తాళ్ల గిరి, రూరల్ మండలం ఉపాధ్యక్షులు చంద్రశేఖర, ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, సెక్రటరీ జనార్దన్, విజయ్ కుమార్, గంగులప్ప, నరేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.