వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేపట్టిన స్కూటర్ యాత్రకు జనసేన మద్దతు

మదనపల్లె లో చిత్తూర్ బస్టాండ్ వాల్మీకి సర్కిల్లో.. గురువారం వాల్మీకులని ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూల్ జిల్లా మంత్రాలయం నుండి స్కూటర్ యాత్ర చేపట్టిన క్రాంతినాయుడు, బొగ్గుట్టి కృష్ణమూర్తి, ఆనంద్, గంగరాజు, ప్రభాకర్ భాగ్యమ్మ, కృష్ణవేణమ్మ, గోవింద్ కాండక్టర్ రమణ.. వీరికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి మరియు ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, కార్యదర్శి గజ్జెల రెడ్డప్ప, మండల అధ్యక్షుడు రోనురి బాబు, రాంచరణ్ ఫాన్స్ ప్రేసిడెంట్ నవీన్ మద్దతు తెలిపి.. ఇదివరలో కాంగ్రెస్ పార్టీ వారు రాజకీయ భవిష్యత్ కోసం ఎస్టీ లో ఉన్న వాల్మీకులని బీసీ లో చేర్చినారు.. ఇదివరకు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వారి మనిఫెస్ట్లోలో ఎస్టీ లో చేర్చుతాము అని మాట చెప్పి.. మాట తప్పిగా.. వైస్సార్సీపీ పార్టీ కూడా మోసము చేయడము జరిగినది. వీరికి న్యాయం జరగాలని మదనపల్లె జనసేన నాయకులు మద్దతు తెలపడం జరిగింది.