జనసేన-టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పరిచయ కార్యక్రమం
చింతలపూడి నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఆదివారం చింతలపూడిలో జరిగిన చింతలపూడి నియోజకవర్గ జనసేన-టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ తో జనసేన పార్టీ శ్రేణుల పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చింతలపూడి నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-10-at-19.46.41.jpeg)