శంకుపర్తి గ్రామంలో జనసేన టీం పర్యటన

శంకుపర్తి గ్రామంలో బుధవారం జనసేన టీం సభ్యులు పర్యటించారు. ఈ సందర్బంగా జనసేన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. శంకుపర్తి రెవెన్యూ పరిధిలో కోట్లాది రూపాయల భూములు ఎవరు అమ్మారు? ఎవరు కొనుక్కున్నారు? అన్నది మిస్టరీగా ఉంది. నిజమైన రైతులు మాత్రం ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీరు లేదు. వీరి బ్యాంకు బ్యాలెన్స్ లో లక్షలు కూడా కనిపించడం లేదు కానీ వీరి డాక్యుమెంటేషన్లు చూస్తే లక్షల నుండి కోట్లాది రూపాయలు మారినట్లు తెలుస్తుంది. ఈ డబ్బులు ఎక్కడ చేరాయి అన్నది మనం తెలుసుకోవలసిన అవసరముంది. నిజంగా భూమిలో ఉన్న రైతులు ఇప్పటికే సాగులో ఉంటూ వారు పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూసి లబోదిబోమంటున్న ఆదివాసి గిరిజనులు సర్వే నెంబర్ 14/3 5-1, 9-1 19-2,11-1.55,53-1 అలాగే సుర్ర తమ్మయ్య ఖాతా నెంబర్:28 చనిపోయారు, గాని ఇప్పటికి జీవించి ఉన్నాడని ధ్రువీకరించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం రెవిన్యూ డిపార్ట్మెంట్ సరైన రీతిలో దర్యాప్తు చేస్తే నిజాలు అన్ని బయటికి వస్తాయి కానీ స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు రెవిన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. 220 ఎకరాల భూమిని ఎవరు అమ్మారు? ఈ భూమి యొక్క డబ్బులు ఎవరికి చేరాయి? ఎలా చేరాయి? అన్నది కూడా దర్యాప్తులో తేలాలి. కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నది ఎవరు?. శంకుపర్తి భూమి నుండి అమాయక గిరిజనులు మాత్రం ఉండడానికి గూడు, గుడ్డ, చెప్పులు లేక ఉన్నారు. వీరి భూములు మాత్రం కోట్లాది రూపాయలు వ్యాపారం చేసి సంపాదించింది ఎవరు. వీర అమాయకత్వాన్ని తెలుసుకొని ఎవరు డబ్బులు తీసుకున్నారు. ఈ గిరిజనులు మాత్రం ఇక్కడకు వచ్చింది ఒక వ్యక్తి అని చెప్తున్నారు. పేరు వేల పూరి మారుతి చంద్ర మోహన్ ఈయన తప్ప ఈ గిరిజనులకి ఎవరూ తెలియదు. కోట్లాది రూపాయలు విరి అస్తిని ఎవరు దోచుకున్నారు అన్నది దర్యాప్తులోనే తేలాలి. దయాప్తులో తేలినప్పుడే నిజమైన గిరిజనులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ వారిని అడ్డగించడం ఆదివాసు బిడ్డల వారి కష్టాలను చెప్పకుండా వారిని బెదిరిస్తుంది ఎవరు? రెవిన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు నిజమైన దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకోలేక పోతుంది. ఒక్క సెంటు భూమి కూడా లేకుండా ఏ రైతు అమ్మడు ఎవరి భూమి ఎక్కడో ఉందో అన్నది కూడా కొన్నవాడు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన శిక్ష తీసుకోవాలని గ్రామస్తులు జనసేన నాయకుడైన ప్రవీణ్ కుమార్ కు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు మురళి, నవీన్ కుమార్, మంగళ, రమేష్, సుధాకర్, వీరమహిళ రత్నప్రియ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.