వీరమహిళ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

రాజోలు నియోజకవర్గం: రాజోలు గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ భర్తకు ప్రమాదవశాత్తు కాలు ఫ్యాక్చర్ అయినది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు బుధవారం వారిని కలసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. వారివెంట సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, గ్రామశాఖ అధ్యక్షులు కాట్న రాజు, కాట్రినిపాడు నాగేంద్ర, అలీ అబ్బాస్ తదితరులు ఉన్నారు.