ఎన్నారై సత్య వెజ్జు ఆర్ధిక సహాయంతో జనసేన వాటర్ ట్యాంక్
పోలవరం, బండివారిగూడెం పంచాయితీ, గంగినీడిపాలెంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో ఎన్నారై జనసేన సత్య వెజ్జు ఆర్ధిక సహాయంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ మరియు టి.రామచంద్రం పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలని, ఈ వైసీపీ అరాచక పాలనా పోవాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమన్నారు. నేడు ఒక సమస్య వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టి.నరసాపురం మండల నాయకులు మరియు అన్ని మండల నాయకులు కార్యకర్తలు జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-15.00.57-1024x461.jpeg)