దివ్యాంగుడికి అండగా నిలిచిన జనసేన
సూళ్లూరుపేట: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో మరియు ఆయన ముఖ్యమంత్రి కావాలని సంకల్పించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేపట్టిన మన ఇల్లు మన ఇల్లు – మన జనసేన కార్యక్రమాన్ని కొన్ని రోజుల క్రితం తడ మండలం, మాంబట్టు గ్రామంలో నిర్వహించినప్పుడు కార్యక్రమంలో భాగంగా పెంచలదొర అనే దివ్యాంగుడిని గుర్తించడం జరిగినది. సోమవారం మిషన్ మారుతి సంస్థ సహకారంతో జనసేన పార్టీ తరఫున సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో ఎన్.ఆర్.ఐ బాల సుబ్రమణ్యం చేతుల మీదుగా పెంచలదొరకు ట్రై సైకిల్ అందించి, వారి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. అలానే సహకరించిన మిషన్ మారుతి సంస్థ అధ్యక్షులు డా. నవీన్ కుమార్ మరియు టీమ్ కి సోమశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్ మరియు తడ మండల కార్యదర్శి పవన్ కాశి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జనసేవ కార్యక్రమంలో స్థానిక మాంబట్టు మరియు కట్టవ గ్రామ జనసైనికులు పాల్గొని పవన్ అన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-11.12.28-AM-1-1024x768.jpeg)