పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం: పుంగనూరు జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతి విచ్చేయుచున్న సందర్భంగా వారికి ఘనస్వాగతం పలకడానికి పుంగనూరు నియోజకవర్గం నుండి 14 కార్లలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ మరియు మండల పార్టీ అధ్యక్షులు నరేష్, విరూపాక్ష, బుషన్, దీప మోహన్, రెడ్డి శేఖర్, జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, నందు, ఐటీ ఇంచార్జీ దేసాడి వికాస్ అధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ కార్యకర్తలకి ఏ కష్టం వచ్చిన ఆదుకొనే స్వభావం గల రాజకీయ పార్టీ అని మా పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి వారి కార్యకర్త మీద పోలీస్ దాడులు జరిగినప్పుడు ఏవో ప్రెస్ మీట్ లు జరగడము, ఖండిచడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీ కార్యకర్త మీద చేయి చేసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒక పార్టీ అధ్యక్షులుగా మా పవన్ కళ్యాణ్ గారు విచేయయు చున్నారు. ఇది ప్రజా స్వామ్యం దేశం. ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకొనేందుకు కోసం శాంతి యుతంగా ర్యాలీలు చేయడం ప్రజా స్వామ్యం హక్కు. మా కార్యకర్త మీద చేయి చేసుకున్న శ్రీ కాళహస్తి సి.ఐ అంజు యాదవ్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం నాయకులు చంద్ర, హరీ నాయక్, బాలాజీ నాయక్, మురళి, గణేష్, రమేష్, నాగరాజ, మనోజ్ లు పాల్గొన్నారు.