వైసిపి ఒప్పుకుంటే జనసేన రోడ్డు వేస్తుంది

  • వైసిపి నాయకులను ఎప్పటికీ నమ్మము అంటున్న శివన్నపాలెం గ్రామ ప్రజలు

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మపాలెం నుండి శివన్నపాలెం వరకు వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు వైసిపి మరియు టిడిపి రెండు పార్టీలు పోటా పోటీగా ఈ ప్రధాన రహదారిని నిర్మిస్తామని శివన్నపాలెం గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఈ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పటికీ వైసిపి ప్రభుత్వాన్ని నమ్మము అని గ్రామ ప్రజలు అంటున్నారు. తిమ్మపాలెం నుండి శివన్నపాలెం వరకు ఈ ప్రధాన రహదారిని నిర్మించి, బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాలకు బల్బులు కూడా వేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సోమవారం రోజు అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. వైసిపి నాయకులు బహిరంగంగా శివన్నపాలెం గ్రామం ప్రధాన రహదారిని మేము నిర్మించలేము అని చెబితే వెంటనే జనసేన నాయకులు చందాలు వసూలు చేసి, దాతలు ద్వారా ఈ ప్రధాన రహదారిని నిర్మించడానికి జనసేన సిద్ధంగా ఉంది అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పెయ్యల రవి కుమార్ యాదవ్ (ఉపాధ్యక్షులు), సుంకేశ్వరం శ్రీను (కార్యదర్శి), పులి రాజేష్ (సంయుక్త కార్యదర్శి), చిన్న బాబు, మహేంద్ర, అనిల్, యోనోస్, సునీల్ పాల్గొనడం జరిగింది.