టిడిపి నుంచి జనసేనలోకి చేరిక
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి, టిప్పర్ల బజార్ 29 వ వార్డుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్.బాషా ఎంటిఎంసీ మైనార్టీ సెల్ కో ఆర్డినేటర్ షేక్ సుభాని ద్వారా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో శనివారం ఉదయం జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పీ, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులై బాషా పార్టీలో చేర్చడం జరిగిందని, జనసేన పార్టీలో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకు వెళ్లే విధంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఎంటిఎంసీ నగర అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబ శివ రావు (జె.ఎస్.ఆర్), ఎంటిఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి నియోజకవర్గ యూత్ నాయకులు చిట్టెం అవినాష్, సీనియర్ నాయకులు నారాయణ, కొండలరావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-6.37.49-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-6.37.50-PM-1-1024x615.jpeg)