జనసేన పార్టీలో చేరికలు

పలమనేరు నియోజకవర్గం: వీ.కోట మండలం, తోటకనుమకు చెందిన పలువురు లతిన్ రెడ్డి అతని సన్నిహితులు మరియు పెంగారగుంట పంచాయితి కోతి గుట్టకి చెందిన శ్రీ రాములు, హరీష్, రామ్మూర్తి, రాజేష్, నవీన్, సదాశివ, రాజు, రమణ జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పసుపులేటి దిలీప్ మరియు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీ కండువా వేసుకున్నారు. భవిష్యత్తు గారంటీ కార్యక్రమంలో భాగంగ పలమనేరు రూరల్ మండలం పెంగరగుంతలో నియోజకవర్గ మరియు వీ.కోట మండల జనసేన పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు రాబోయే ఎన్నికలలో వుమ్మడి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఇంఛార్జి నాగరాజు, గంగవరం ఇంఛార్జి చందు, నాయకులు శన్ముగం, అయాజ్, హరి, సాంబ, సంజయ్, మాధవ, సోము, తరుణ్, హరినాథ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.